Monday, April 29, 2024

ఐర్లాండ్‌లో భారతీయ మహిళ విషాదాంతం

- Advertisement -
- Advertisement -

Woman and her kids died in Ireland

మైసూరు/డబ్లిన్: ఐర్లాండ్‌లో ఓ భారతీయ మహిళ తన ఇద్దరు పిల్లలతో మృతి చెందారు. డబ్లిన్‌లో గత వారం ఈ సంఘటన జరిగింది. వెంటనే కర్నాటకలోని హడగన్‌హళ్లిలోని ఆమె కుటుంబానికి ఈ విషయాన్ని డబ్లిన్ పోలీసులు తెలియచేశారు. 37 ఏళ్ల సీమా బానూ, పిల్లలు అస్ఫిరా(11) ఫైజాన్ సయ్యద్(7) సౌత్ డబ్లిన్‌లోని బలిన్‌టీర్‌లో చనిపోయి ఉండగా పోలీసులు గుర్తించారు. ఈ మహిళ భర్త సయ్యద్ సమీర్ డబ్లిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరి కుటుంబం ఏడు నెలల క్రితమే ఐర్లాండ్‌కు వెళ్లింది. హత్య కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డబ్లిన్ పోలీసు అధికారి తెలిపారు. ఐర్లాండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం వారు స్పందించారు. ఈ ఘటనపై తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Woman and her kids died in Ireland

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News