Monday, April 29, 2024

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్: భారీ స్కోరు దిశగా ఆసీస్

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా మెల్ బోర్న్ స్టేడియం వేదికగా భారత్ జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఆసీస్ ఓపెనర్ అలిస్సా హేలి(75; 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లపై విరుచుకుపడింది.  మరో ఓపెనర్ బెత్ మూనీ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో వీరిద్దరూ మొదటి వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత హేలి ఔటైనా మూని వరుస బౌండరీలతో అర్థ సెంచరీ బాదింది.  మరో ఎండ్ లో కెప్టెన్ లన్నింగ్(16), జార్డ్నింగ్(02)లు వరుసగా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ మూని(68), రాచెల్ హేన్స్(3)లు ఉన్నారు.

Womens T20 World Cup: Healy hits 75 runs against INDW

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News