సంగారెడ్డి: జిల్లాలో జహీరాబాద్ పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా సోకింది. కరోనాతో మరణించిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల జహీరాబాద్కు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆ మహిళ నుంచి నమూనాలు సేకరించారు. ఇంతలోనే చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు అదేరోజు రాత్రి తమ గ్రామంలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, చనిపోయిన మహిళకు పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఒకే కుంటుంబానికి చెందిన 19 మందికి పాజిటివ్ వచ్చింది. వారిని చికిత్సకోసం జిల్లా తరలించి చికిత్స అందిస్తున్నారు.
19 Same family members test positive for corona