- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,569 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 6,235 కొత్త కోవిడ్-19 కేసులు, 51 మరణాలు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 6,31,749కి చేరాయి. ఎపిలో ఇప్పటివరకు 5,410 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 5,51,821 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 74,518 యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో ఇప్పటివరకు 51లక్షల 60,700 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
6235 New Covid 19 Cases Reported in Andhra Pradesh
- Advertisement -