- Advertisement -
లక్నో: స్నానం చేయిస్తానని తీసుకెళ్లి ఎనిమిదేండ్ల పాపపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అజమ్ ఘడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దినేష్ (20) అనే యువకుడు తన పక్కింట్లో వెళ్లి అమ్మాయికి స్నానం చేయిస్తానని పాప తల్లికి చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం పాపపై అత్యాచారం చేశాడు. పాప తనకు నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేసింది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశామని అజమ్ ఘఢ్ ఎస్ పి సుధీర్ సింగ్ తెలిపాడు.
- Advertisement -