అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వైసిపి ప్రభుత్వ బడ్జెట్ చూస్తుంటే.. ప్రచారం ఘనం చేతలు శూన్యం అన్నట్లుగా ఉందని విమర్శించారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు వైసిపి స్టిక్కర్లు వేశారని కన్నా ఎద్దేవా చేశారు. ఖాజానా ఖాలీ చేసి అప్పులు చేస్తూ, ఆస్తులు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనపై అవగాహన లేక కోర్టు మొట్టికాయలు తింటున్నారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రానికి రివర్స్ గేర్ వేస్తున్నారని కన్నా మండిపడ్డారు.
వైకాపాప్రభుత్వ బడ్జెట్ ప్రకటన లోగుట్టు
కేవలం "ప్రచారం ఘనం-చేతలు శూన్యం".
ఏడాదిగా కేంద్రనిధులతో ఉన్న పథకాలకు సొంతస్టిక్కర్లు వేశారు.ఖజానా ఖాళీచేసి అప్పులు చేస్తూ ఆస్తులు అమ్మేస్తున్నారు.పరిపాలన అవగాహనలేక కోర్టు మొట్టికాయలు తింటూ అభివృద్దే లేకుండా రాష్ట్రానికి రివర్స్ గేరు వేశారు. pic.twitter.com/0gmAXMfFqM— Kanna Lakshmi Narayana (@klnbjp) June 16, 2020