Thursday, May 23, 2024

బోలేరో వెనక డోర్ తెరుచుకొని ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Bolero vehicle incident

అమరావతి: బోలేరో వెనక డోర్ తెరుచుకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం అర్జాపురం గ్రామానికి చెందిన వలస కూలీలు మిరప తోటలో పని చేయడానికి కృష్ణా జిల్లాకు వెళ్తుండగా బోలేరో వాహనం వెనక డోర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాడేపల్లి గూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతులు రాజా తాతలు, ఎర్రంశెటి నూకరాజుగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు బోలేరో వాహనంలో 25 మంది కూలీలు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News