Sunday, May 26, 2024

రాజ్యసభ ఉపఎన్నికకు సుశీల్ కుమార్ మోడీ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

పాట్నా: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ ఏర్పడిన బీహార్‌లోని రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక కోసం బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తోపాటు అధికార ఎన్‌డిఎకు చెందిన పలువురు నాయకుల సమక్షంలో సుశీల్ కుమార్ మోడీ పట్నా కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో తన క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ మోడీతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా నితీష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎంఎల్‌సిగా ఉన్న సుశీల్ గతంలో లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారని, అంతకుముందు ఎంఎల్‌ఏగా కూడా పనిచేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైతే ఉభయ పార్లమెంట్ సభలకు చెందిన సభ్యుడిగానే కాక శాసనసభ, మండలిలో పనిచేసిన అరుదైన అవకాశం ఆయనకు దక్కుతుందని నితీష్ కొనియాడారు.

Sushil Kumar Modi files nomination for Rajya Sabha by-polls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News