- Advertisement -
లతేహర్(జార్ఖండ్): లతేహర్ జిల్లాలోని ఒక బొగ్గు గని ప్రాజెక్టుపై దాడి చేసిన నక్సలైట్ల బృందం విచక్షణారహితంగా కాల్పులు జరపగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి బలూమత్ పోలీసు స్టేషన్ పరిధిలోని తేతారియాఖర్ బొగ్గు గని ప్రాజెక్టు వద్దకు వెళ్లిన నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న నాలుగు ట్రక్కులకు కూడా నక్సల్స్ నిప్పంటించారని వారు తెలిపారు. నక్సల్స్ దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు బయల్దేరి వెళ్లగా అప్పటికే వారు పరారయ్యారు. గాయపడినవ్యక్తులను బలూమత్ కమ్యూటిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందచేసినట్లు పోలీసులు చెప్పారు.
Naxalites Attack Coal Mine Project in Jharkhand
- Advertisement -