Friday, May 24, 2024

ప్రాణం తీసిన కోతి….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కోతి చేసిన పనికి ఓ వ్యక్తి ప్రాణాలు పోయిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఓ వ్యక్తి తలపై ఇటుకను కోతి పడేయడంతో అతడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివసిస్తున్నాడు. కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ఇంటిపై ఉన్న వ్యాటర్ ట్యాంక్‌పై ఇటుక పెట్టాడు. కోతులు ఇటుకను కిందపడేయడంతో అతడి తల పలిగింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News