Friday, May 24, 2024

కోల్‌కతా తడబాటు.. రాజస్థాన్ లక్ష్యం 134

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. రాజస్థాన్ బౌలర్లు చెలరేగడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోల్‌కతా, రాజస్తాన్ జట్టుకు 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని‌ నిర్దేశించింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో రాహుల్‌ త్రిపాఠి(36), నితీష్ రాణా(22), దినేష్ కార్తిక్(25)లు పర్వాలేదనిపించారు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. రాజాస్థాన్ బౌలర్లలో క్రిస్‌ మోరీస్‌ నాలుగు వికెట్లు తీయగా జయదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

IPL 2021:KKR sets target 134 runs against RR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News