Thursday, May 23, 2024

రేపు మెదక్‌లో కవి సమ్మేళనం

- Advertisement -
- Advertisement -

మెదక్: తెలంగాణ సాహిత్య దినోత్సవంలో భాగంగా ఈనెల 11న ఆదివారం మెదక్ పట్టణంలో కవి సమ్మేళనం నిర్వమిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొల్చారంలోని మల్లినాథసూరి విగ్రహానికి పూలమాలతో సాహిత్య నీరాజన కార్యక్రమంలో ఉంటుందని అన్నారు. అనంతరం 4 గంటలకు స్థానిక సాయి బాలాజీ గార్డెన్స్ పక్కనగల హ్యాపీ మూమెంట్ బాంకెట్ హాల్‌లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ కవి సమ్మేళనంలో తెలంగాణ ఆస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిభింబించేలా కవితలు ఉంటాయని అన్నారు.ఇందుకోసం పేరు నమోదు చేసుకుని ఎంపిక కమిటీ ద్వారా ఆహ్వానం అందుకున్న కవులు మాత్రమే ఇట్టి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సాహితి అభిమానులు, అధికారులు, తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News